ఈనెల 11న ఏపీ కేబినెట్‌ విస్తరణ | Sakshi
Sakshi News home page

ఈనెల 11న ఏపీ కేబినెట్‌ విస్తరణ

Published Fri, Nov 9 2018 4:53 PM

ఏపీ కేబినెట్‌​ విస్తరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు కొత్త రాజకీయాలు ప్రారంభించారు. మైనార్టీలు, ఎస్టీ వర్గాలకు మంత్రి పదవులంటూ తాయిలాలు ప్రకటించడానికి సిద్దమయ్యారు. నాలుగున్నరేళ్లుగా ఎస్టీ, మైనార్టీలకు కేబినెట్‌లో చంద్రబాబు చోటు కల్పించలేదు. దీంతో ఆ వర్గాల నుంచి ఎన్నికల సమయంలో వ్యతిరేకతను తగ్గించుకోవాలని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 11న ఉదయం 11.30కు ఏపీ కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారు చేశారు.