ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టారు | The division of the state with the chandrababus letter | Sakshi
Sakshi News home page

ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టారు

Apr 5 2018 12:50 PM | Updated on Mar 20 2024 3:21 PM

ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాకట్టుపెట్టారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ.. ఏనాడైనా అమరావతికి చంద్రబాబు దండం పెట్టారా? ఫొటోలో పోజుల కోసం పార్లమెంటుకు మొక్కుతారా అని చంద్రబాబునుద్దేశించి దుయ్యబట్టారు. ఢిల్లీలో చంద్రబాబును కలవడానికి ఎవరు ముందుకు రాలేదని తెలిపారు. ఢిల్లీ వెళ్లి హేమమాలినిని కలిసి వస్తావా.. ఏపీ సీఎంగా ఆంధ్రుల పరువు తీశారని ఘాటుగా విమర్శించారు.

చంద్రబాబు నాయుడి లేఖతోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగిందని, ఏపీ ప్రయోజనాలు కోసం చంద్రబాబు ఏనాడూ పోరాటం చేయలేదని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అధికారంలోకి రావడానికి అడ్డుగోలు హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక అవినీతి అసమర్థత పాలన చేస్తున్నారని మండిపడ్డారు. వాటిని కప్పిపుచ్చుకొనేందుకే బీజేపీ పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే నరేంద్ర మోదీపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement