బ్యాంకు అధికారులపై దాడి
రుణం మంజూరు చేయలేదనే కారణంతో ఓ వ్యక్తి బ్యాంక్ అధికారులపై దాడి చేసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కోయంబత్తూర్ కెనరా బ్యాంక్ శాఖలో వెట్రివేల్ అనే వ్యక్తి తన ఆస్తిని తాకట్టు పెట్టి కోటి రూపాయలు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎలాంటి అడ్డంకులూ లేకుండా రుణం మంజూరు చేయించేందుకని వెట్రివేల్ ఓ మధ్యవర్తికి రూ.3 లక్షలు నగదు కూడా చెల్లించాడు. కానీ బ్యాంక్ అధికారులు ఆయన లోన్ దరఖాస్తును తిరస్కరించడం వెట్రివేల్కు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన కత్తి, తుపాకితో బ్యాంక్ మేనేజరుపై దాడికి దిగాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు