రఫెల్‌ డీల్‌తో లక్షల కోట్ల అవినీతి జరిగింది | Congress chief Rahul Gandhi fire On narendra modi in Jan Aakrosh Rally | Sakshi
Sakshi News home page

రఫెల్‌ డీల్‌తో లక్షల కోట్ల అవినీతి జరిగింది

Apr 29 2018 12:53 PM | Updated on Mar 22 2024 10:49 AM

తప్పుడు హామీలతో దేశ ప్రజలను ప్రధాని మోదీ ఇంకా మభ్య పెట్టాలని చూస్తున్నారంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆక్షేపించారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్‌ జన్‌ ఆక్రోశ్‌ ర్యాలీలో రాహుల్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘దేశంలో వెళ్లిన ప్రతీ చోటల్లా నేను ప్రజలను అడిగేది ఒక్కటే. మోదీ పాలనలో సంతోషంగా ఉన్నారా? అని.. వారందరి నుంచి ముక్తకంఠంతో వినిపించే సమాధానం ఒక్కటే. లేదు అని.. ప్రజల కళ్లలో మోదీపై ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి’ అని రాహుల్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement