ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్‌ భేటీ | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్‌ భేటీ

Published Sun, Dec 1 2019 2:52 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులతో భేటీ అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 97 డిపోల నుంచి డిపోకి ఐదుగురు చొప్పున సీనియర్‌ కార్మికులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశ అనంతరం కార్మికులతో కలిసి సీఎం కేసీఆర్‌ మధ్యాహ్న భోజనం చేశారు.

Advertisement
Advertisement