కేంద్ర మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజనా చౌదరి నివాసంతో పాటు, కార్యాలయాల్లోనూ సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక నుంచి వచ్చిన సీబీఐ అధికారులు పంజాగుట్ట నాగార్జున సర్కిల్లోని సుజనా చౌదరి కార్యాలయంలో శనివారం ఉదయం నుంచి తనిఖీలు జరుపుతున్నారు. నగరంలో మొత్తం మూడుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బ్రాంకింగ్ ప్రాడ్ సెల్ టీమ్ సభ్యులు కూడా సోదాలు చేశారు.