రాజధానికి విశాఖపట్నం అనువైన ప్రాంతం | Botsa Satyanarayana Slams TDP Leaders | Sakshi
Sakshi News home page

రాజధానికి విశాఖపట్నం అనువైన ప్రాంతం

Dec 29 2019 7:35 PM | Updated on Mar 21 2024 8:24 PM

రాజధానికి విశాఖపట్నం అనువైన ప్రాంతం అని మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను తలదన్నే రాజధానిని ఏపీలో అభివృద్ది చేయాలంటే విశాఖపట్నంను మించి మరో ఆప్షన్ లేదని,ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  భారతదేశంలో శరవేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి అన్నారు. హైదరాబాద్‌ను మించి అభివృద్ధి చెందుతున్న విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా చేయడం చంద్రబాబుకు ఇష్టం లేదా అని నిలదీశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement