మానవ వనరుల్ని తయారు చేయండి : సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

మానవ వనరుల్ని తయారు చేయండి : సీఎం జగన్‌

Published Tue, Aug 13 2019 7:55 PM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశ్రమలు, వాణిజ్యంపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో జరుగిన ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ రోజా, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాల అమలుకు వీలుగా నైపుణ్యమున్న మానవనరులను తయారుచేయాలని సీఎం స్పష్టం చేశారు.