రౌడీలు వీరవిహారం , పోలీసులే పారిపోయారు | YSRCP condemns bhuma supporter abhiruchi madhu gun firing | Sakshi
Sakshi News home page

Aug 24 2017 1:42 PM | Updated on Mar 21 2024 8:47 PM

నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై జరిగిన దాడిని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. కాల్పులకు పాల్పడ్డ అభిరుచి మధును తక్షణమే అరెస్ట్‌ చేయాలని ఆ పార్టీ డిమాండ్‌ చేసింది. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు పాలన అంతా రక్తచరిత్రే అని అన్నారు. టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, నడిరోడ్డుపై రౌడీలు వీరవిహారం చేస్తుంటే పోలీసులు పారిపోతున్నారన్నారు. రౌడీషీటర్కు గన్‌ ఎక్కడ నుంచి వచ్చిందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఆయుధాలను పోలీస్‌ స్టేషన్‌లో ఎందుకు అప్పగించలేదని, టీడీపీ నేతలకు నిబంధనలు వర్తించవా అని అన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement