తిరుపతిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే నారాయణ రెడ్డిలు ఆందోళన చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు భూమన, నారాయణ రెడ్డిలను అరెస్టు చేశారు. ఆర్టీసీ బస్టాండులో పోలీసులు బందోబస్తు మధ్య అధికారులు బస్సులను నడుపుతున్నారు. మరో వైపు వైఎస్సార్ సీపీ నేత కోనేటి ఆదిములం ఆధ్వర్యంలో నారాయణ వనం హైవేపై కార్యకర్తలు ధర్నా నిర్వహిస్తున్నారు.