'అన్న వస్తున్నాడు' పేరుతో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టబోయే పాదయాత్రకు ముందు 60 రోజుల్లో మూడు అంశాలతో పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించింది. వైఎస్సార్ సీపీ రాష్ట్రస్థాయి విస్తృతస్థాయి సమావేశం సోమవారం రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో చర్చించిన అంశాలను ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాకు వివరించారు. ఈ భేటికి 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారని తెలిపారు. మూడు ప్రధాన అంశాలతో ప్రజల దగ్గరకు వెళ్లబోతున్నట్టు ఆయన వివరించారు.
Jul 31 2017 3:37 PM | Updated on Mar 21 2024 8:57 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement