అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసపుచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతూ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బుధవారం నుంచి చేపడుతున్న సమరదీక్షకు సర్వం సిద్ధమైంది. రెండు రోజుల పాటు సాగే సమరదీక్షకు గుంటూరు జిల్లా మంగళగిరి ‘వై’ జంక్షన్ సమీపంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. చంద్రబాబు మోసాలపై ప్రజల్లో ఎండగట్టడంతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో ఈ దీక్ష చేపడుతున్నారు.
Jun 3 2015 7:47 AM | Updated on Mar 21 2024 6:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement