వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అంతు చిక్కని వ్యాధి ప్రబలిన కొత్తమాజేరు గ్రామాన్ని ఆయన సందర్శిస్తారు. వ్యాధి కారణంగా ఈ గ్రామంలో 20 మంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదనే వార్తలు వస్తున్నాయి.