బాబు ఆంతర్యమేమిటి..? | Sakshi
Sakshi News home page

బాబు ఆంతర్యమేమిటి..?

Published Thu, Jun 18 2015 6:55 AM

అవినీతి నిరోధక శాఖ ‘ఓటుకు కోట్లు’ కేసు విచారణను మరింత వేగవంతం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డిని అధికారులు బుధవారం సుమారు 5 గంటల పాటు విచారించారు. ఈ కేసులో నిందితులు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహల ఫోన్ కాల్‌డేటా, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో బేరసారాల సందర్భంగా రేవంత్‌రెడ్డి చెప్పిన మాటల వీడియో ఫుటేజీలు, ఏసీబీ కస్టడీలో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నరేందర్‌రెడ్డిని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. వాస్తవానికి మంగళవారం రాత్రే ఏసీబీ అధికారులు వేం నరేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను ఏసీబీ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా కోరారు. అయితే ఆరోగ్య కారణాల రీత్యా బుధవారం వస్తానని ఆయన హామీ ఇవ్వడంతో.. తిరిగి వెళ్లిపోయారు. ఈ మేరకు బుధవారం ఉదయం 11.30 సమయంలో వేం నరేందర్‌రెడ్డి ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంపై ఆయనను సాయంత్రం 5 గంటల వరకు విచారించిన అధికారులు.. 5.30 గంటల సమయంలో ఇంటికి పంపించారు. విచారణ సందర్భంగా ఈ వ్యవహారంపై వేం నరేందర్‌రెడ్డిని లోతుగా ప్రశ్నించినట్లు సమాచారం