మద్యం మాఫియా ప్రభుత్వాన్ని నడుపుతోంది | | Sakshi
Sakshi News home page

Jul 1 2013 1:40 PM | Updated on Mar 21 2024 9:14 AM

రాష్ట్రంలో మద్యం మాఫియా సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. నారాయణ ఆరోపించారు. నగరంలోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ సోమవారం ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం చేసిన నూతన ఎక్సైజ్ విధానంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వమే అధికారికంగా మద్యం దుకాణాలను నడిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎక్సైజ్ కార్యాలయం మద్యం మాఫియాతో ఉంటుందో లేక ప్రజలతో ఉంటుందో తేల్చుకోవాలని నారాయణ ప్రభుత్వానికి సూచించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement