వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో టీఆర్ఎస్ నేత మృతిచెందాడు. నల్గొండ నియోజకవర్గ ఇంచార్జి దుబ్బాక నర్సింహారెడ్డి సోదరుడు దుబ్బాక సతీష్రెడ్డి కారులో ప్రయాణిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి చిట్యాల వైపు వస్తుండగా.. నార్కెట్పల్లి బైపాస్ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామను ఈ ప్రమాదం జరిగింది. సతీష్ రెడ్డి భార్య మమత నెరడ ఎంపీటీసీగా పని చేస్తున్నారు. ఘటనాస్థలాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు.
Jul 28 2017 2:39 PM | Updated on Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement