'ఎవరి పరీక్షలు వారివే...ఉమ్మడి ప్రసక్తే లేదు' | telangana-to-conduct-separate-inter-exams | Sakshi
Sakshi News home page

Nov 14 2014 1:05 PM | Updated on Mar 21 2024 7:52 PM

ఇంటర్మీడియెట్ పరీక్షల వివాదం మళ్లీ మొదటికొచ్చింది. మార్చి11 నుంచి ఉమ్మడి పరీక్షలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ సర్కార్ మాత్రం ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించే ప్రసక్తే లేదనే స్పష్టం చేసింది. ఎవరి పరీక్షలు వారే నిర్వహించుకోవాలని సూచించింది. ఇంటర్ పరీక్షలను ప్రత్యేకంగా నిర్వహించేందుకు షెడ్యూల్ తయారు చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఇదే అంశం శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలను తామే నిర్వహించుకుంటామని తేల్చి చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement