గోదావరి నదిపై నిర్మిస్తున్న దేవాదుల ప్రాజెక్టును భారీ ఎత్తిపోతల పథకంగా మార్చాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. మూడు దశల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.9,427 కోట్ల నుంచి రూ.13,445 కోట్లకు పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరిపై చేపట్టదలచిన కంతనపల్లి బ్యారేజీకి బదులుగా తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించింది. ఆయకట్టు స్థిరీకరణతో పాటు బహుళ ప్రయోజనాలు ఉండేలా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మల్కాపూర్ దగ్గర 10 టీఎంసీల సామర్థ్యంతో భారీ రిజర్వాయర్ నిర్మించాలని తీర్మానించింది.
Feb 3 2017 6:58 AM | Updated on Mar 20 2024 1:23 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement