తమిళనాడులో వీడని ప్రతిష్టంభన | Tamil Nadu political Blockade continues, Governor yet to take a decision | Sakshi
Sakshi News home page

Feb 16 2017 7:14 AM | Updated on Mar 22 2024 11:04 AM

తమిళనాడులో రాజకీయ ప్రతిష్టంభన ఇంకా తొలగిపోలేదు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎంపికైన పళనిస్వామి తనకు 128 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరి రెండు రోజులైనప్పటికీ గవర్నర్‌ సీహెచ్‌. విద్యాసాగర్‌రావునుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతున్నవారిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడమే పార్లమెంటరీ సంప్రదాయమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒకే పార్టీలోని ఇరువర్గాలు పోటీ పడుతున్నప్పుడు శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచి బలపరీక్షకు అవకాశమివ్వవచ్చని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ కూడా సోమవారం ఇదే సూచించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement