సీఎం తనయుడైతే కాళ్లు పట్టుకుంటారా? | shame less Ministers in AP: jogi ramesh | Sakshi
Sakshi News home page

Oct 10 2016 4:15 PM | Updated on Mar 20 2024 5:24 PM

తెలంగాణ ప్రభుత్వం ద్వారా హైదరాబాద్‌లో నల్లధనం మార్పిడి జరిగిందని, రూ.10 వేలకోట్లు మార్పిడి జరిగితే అదంతా కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిదేనని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సొల్లు కబుర్లు చెబుతున్నారని రమేష్ మండిపడ్డారు. నీకుగానీ, మీ నాయకుడు చంద్రబాబుకు దమ్ముంటే.. ఆ డబ్బు జగన్‌మోహన్‌రెడ్డిదేనని నిరూపించే సత్తా ఉంటే ముందుకు రావాలని ఛాలెంజ్ విసిరారు. మీరే కేంద్రంలోనూ,. రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నారు. నీకు నిరూపించే ధైర్యం ఉంటే ఆ డబ్బంతా నీకో, నీపార్టీకో, అధినేత చంద్రబాబుకో రాసివ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ దేవినేని ఉమాకు సవాల్ విసిరారు. విజయవాడ నగరంలో ఏ సెంటర్‌లోనైనా సరే పాత్రికేయుల సమక్షంలో చర్చకు రావాలని కోరారు. నిరూపించలేకపోతే నీవేం చేస్తావో చెప్పు అని ఉమాను నిలదీశారు. నల్లధనం మార్చుకునేందుకు నియమనిబంధనలు ఉంటాయన్న విషయం తెలియకుండా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారంటూ మంత్రిపై విరుచుకుపడ్డారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement