మందుగుండు పేలి ఐదుగురి పరిస్థితి విషమం | seven-injured-in-balst-of-fireworks | Sakshi
Sakshi News home page

Feb 15 2015 3:30 PM | Updated on Mar 20 2024 3:34 PM

ఓ ఇంట్లో మందుగుండు సామగ్రి అమ్ముతుండగా ఆదివారం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడగా, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మరువాడలో చోటు చేసుకుంది. క్షతగాత్రుల్లో మందుగుండు వ్యాపారి కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఆరేళ్ల బాలికతో పాటు బాణసంచా కొనుగోలు చేసేందుకు వచ్చిన ఇద్దరు గాయపడినట్లుగా సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement