తెలంగాణ ఉద్యమం గురించి తెలిస్తే సగం మార్కులు వచ్చినట్లేనని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉజ్వల భవిష్యత్ ఆశిస్తున్న నిరుద్యోగ యువకులు అందుకు తగినట్లుగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి తమ కలలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించారు.