లెక్కింపు షురూ: కోవింద్‌ ఆధిక్యమెంత!? | Ram Nath Kovind Set To Win As President Votes Are Counted | Sakshi
Sakshi News home page

Jul 20 2017 1:56 PM | Updated on Mar 22 2024 11:03 AM

రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఎన్డీఏ అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్, యూపీఏ అభ్యర్థిగా మీరాకుమార్‌ తలపడ్డ ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటలకు మొదలైంది. తొలుత పార్లమెంటు హౌస్‌లో ఏర్పాటుచేసిన బ్యాలెట్‌ బాక్సును లెక్కిస్తున్నారు. మొదట ఎంపీల ఓట్లను లెక్కించిన అనంతరం రాష్ట్రాల నుంచి వచ్చిన బాక్సులను ఆంగ్ల వర్ణమాల క్రమంలో లెక్కిస్తారు. దీంతో తొలిరౌండ్‌లోనే అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, ఆంధ్రప్రదేశ్‌ బ్యాలెట్‌ బాక్సులను లెక్కించనున్నారు. మొత్తం నాలుగు టేబుళ్లపై 8 రౌండ్ల పాటు కౌంటింగ్‌ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలకల్లా ఫలితాలు ప్రకటించే అవకాశముంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement