ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్పై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాలకు ఆధార్ లింక్ను ఉపసంహరించుకోవాలని ఆయన మంగళవారమిక్కడ డిమాండ్ చేశారు. ఆధార్ అనుసంధానం విషయంలో సుప్రీంకోర్టు తీర్పును చంద్రబాబు బేఖాతరు చేస్తున్నారా? అని రఘువీరా ప్రశ్నించారు. బాబు పాలనలో సంక్షేమ తలుపులకు మూతలు పడ్డాయని, రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు వంచిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రూ.87 వేల కోట్లు రుణాలు ఉంటే 7వేల కోట్లు రీషెడ్యూల్ చేస్తారా అని రఘువీరా ప్రశ్నించారు. అనధికారికంగా 13 నుంచి 14 లక్షల పింఛన్లపై కోత విధిస్తున్నట్లు సమాచారం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎవరైనా పింఛన్లు, రేషన్ కార్డులు కోల్పోయినా తమ ఫిర్యాదుల విభాగానికి ఉత్తరం రాయవచ్చని రఘువీరా తెలిపారు. రుణమాఫీ ఖరీఫ్కు అమలు చేస్తారా లేకా రబీకి అనే విషయాన్ని చంద్రబాబు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆధార్ లింక్ను ఉపసంహరించుకోవాలి
Published Tue, Sep 30 2014 2:26 PM
Advertisement
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement