‘రెండో స్వచ్ఛత’కు ప్రజల మద్దతు | public's support to the second Swacchatha | Sakshi
Sakshi News home page

Nov 20 2016 8:33 AM | Updated on Mar 20 2024 5:03 PM

నల్ల ధనానికి వ్యతిరేకంగా తాను ప్రారంభించిన ‘రెండో స్వచ్ఛత కార్యక్రమా’నికి (నోట్ల రద్దు) ప్రజల మద్దతు ఉందని ప్రధాని మోదీ అన్నారు. సరిహద్దుల్లో శత్రు స్థావరాలను శుభ్రం చేసే చర్యలైనా, దేశంలోని నల్లధనాన్ని శుభ్రం చేసే చర్యలైనా, అన్నీ సవ్యంగా జరుగుతున్నాయని చెప్పారు. ముంబైలో జరిగిన గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్‌కు పంపిన వీడియో సందేశంలో ఆయన పై మాటలన్నారు. స్వచ్ఛభారత్ విజయవంతమైందని చెప్పారు. దేశంలో నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నెలకొన్న రాజకీయ పరిస్థితిని నోబెల్ గ్రహీత బాబ్‌డిలన్ పాట ద్వారా మోదీ పరోక్షంగా ప్రస్తావించారు.

Advertisement
 
Advertisement
Advertisement