సైకో బీభత్సం..ప్రజల దేహశుద్ధి | Psycho attack in vizag | Sakshi
Sakshi News home page

Oct 15 2016 6:41 AM | Updated on Mar 20 2024 5:03 PM

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో శుక్రవారం రాత్రి ఆకస్మిక దాడులతో ప్రజలను భయభ్రాంతులను చేసిన ఉన్మాదికి దేహశుద్ధి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందు తూ మృతి చెందాడు. వివరాలు.. విశాఖపట్నంలోని కంచరపాలెం ప్రాంతంలో బిహార్‌కు చెందిన ఓ ఉన్మాది (సైకో) శుక్రవారం రాత్రి స్థానిక ప్రజలపై చిన్నపాటి కత్తి, బ్లేడుతో దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశాడు. ఐటీఐ కూడలి నుంచి కంచరపాలెం ఫ్లైఓవర్ వంతెన కూడలి వరకు ఏడుగురికి గాయాలు పడేలా కత్తులతో పొడుచుకుంటూ వీరంగం సృష్టిం చాడు. దీంతో ప్రజలు తలోదిక్కు పారిపోయారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement