కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిరాశే ఎదురైంది. కేవలం రెండు పద్దుల కిందే రాష్ట్రానికి నిధులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ఇవ్వాల్సిన పారిశ్రామిక రాయితీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు కలిపి వడ్డీ రాయితీ కింద రూ. 100 కోట్లు కేటాయించారు. గతేడాది ఇలాగే రూ. 100 కోట్లు కేటాయించినా సవరించిన అంచనాల్లో రూ. 25 కోట్లుగా చూపారు. ఇక ఏపీలో, తెలంగాణలో కలిపి గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు రూ. 20 కోట్లు కేటాయించారు. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు, సింగరేణి, ఇతర జాతీయ సంస్థలకు ఏటా ఇచ్చే సాధారణ ప్రణాళికేతర వ్యయాన్ని ఇందులో చేర్చారు. రైల్వేలకు సంబంధించిన పూర్తి వివరాలను శుక్రవారం వెల్లడిస్తామని ఆ శాఖ ప్రకటించింది.
Feb 2 2017 6:36 AM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement