2015లో విశాఖ జిల్లా చరిత్రలో ఇది చీకటి దినం అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు వ్యాఖ్యానించారు. విశాఖ జెడ్పీ సమావేశంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. బాక్సైట్ అంశంపై బుధవారం జరిగిన సమావేశం దద్దరిల్లింది. సమావేశం ప్రారంభం కాగానే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాట్లాడుతూ... బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని పట్టుబట్టారు.