ఇద్దరు భారత మతగురువులు క్షేమమే | Missing Nizamuddin Dargah Clerics safe, says Pakistan | Sakshi
Sakshi News home page

Mar 19 2017 10:26 AM | Updated on Mar 21 2024 6:40 PM

పాకిస్తాన్‌లో అదృశ్యమైన భారత ముస్లిం మతగురువులు క్షేమంగా ఉన్నట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. భారత్‌ నుంచి లాహోర్‌కు వెళ్లి అదృశ్యమైన హజ్రత్‌ నిజాముద్దీన్‌ దర్గా పీఠాధిపతి సయ్యద్‌ అసిఫ్‌ నిజామీ(80), ఆయన మేనల్లుడు నాజిమ్‌ నిజామీ శనివారం సాయంత్రం కరాచీకి చేరుకున్నట్లు పాక్‌ విదేశాంగ కార్యాలయం పేర్కొంది. మార్చి 20న వారిద్దరు భారత్‌కు తిరిగిరానున్నారు. భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్‌ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తార్‌ అజీజ్‌తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత పాక్‌ ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement