కోలుకుంటున్న అమ్మ! | Sakshi
Sakshi News home page

కోలుకుంటున్న అమ్మ!

Published Thu, Oct 20 2016 7:01 AM

లండన్ నుంచి వచ్చిన ప్రముఖ వైద్య నిపు ణుడు డాక్టర్ రిచర్డ్, అపోలో, ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో వారానికి పైగా జరిగిన చికిత్సకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కొంత మేర మెరుగుపడినట్లు సమాచారం. వీరికితోడు సింగపూర్ నుంచి వచ్చిన ఫిజియోథెరపీ నిపుణులు అందిస్తున్న చికిత్సకు జయలలిత స్పందిస్తున్నట్లు అన్నాడీఎంకే వర్గాలు ప్రకటించాయి. రోజురోజుకు అమ్మ ఆరోగ్యం మెరుగుపడుతుండడంతో ఎయిమ్స్ వైద్యులు ఢిల్లీకి తిరిగివెళ్లారు. అలాగే లండన్ వైద్యుడు రిచర్డ్ కూడా బుధవారం ఇక్కడి నుంచి స్వదేశానికి బయల్దేరారు.

Advertisement
Advertisement