వాళ్లను చంపాం.. మమల్ని పొగడండి! | Jail minister comments on SIMI activists encounter | Sakshi
Sakshi News home page

Nov 1 2016 4:03 PM | Updated on Mar 22 2024 11:05 AM

‘పరారైన వాళ్లను చంపినందుకు మీరు మమ్మల్ని ప్రశంసించాలి. వాళ్లు మరిన్ని ప్రమాదకరమైన పనులు చేయకుండా మేం అడ్డుకున్నాం’ అని మధ్యప్రదేశ్‌ జైళ్లశాఖ మంత్రి కుసుమ్‌ మెహ్‌దెలే వ్యాఖ్యానించారు. భద్రతాపరమైన లోపాల వల్లే సిమీ ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకోగలిగారని ఆమె అంగీకరించారు. సిమీ ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌ చేసినందుకు పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశంసించాలని చెప్పుకొచ్చారు. ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదులు తప్పించుకున్న భోపాల్‌ సెంట్రల్‌ జైలులోని కొన్ని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని అంగీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement