నూతన రాజధాని పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిన వారిని వేటాడేందుకు ఐటీ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. రాజధానిని ఏ ప్రాంతంలో నెలకొల్పాలో ముందుగానే ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా భూములను కొనుగోలు చేసుకున్న విషయం తెలిసిందే . అలా కొనుగోలు చేసిన వారిలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారపార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కొంత మంది ఐఏఎస్ అధికారులు, ఆర్డీవోలతో పాటు ‘ముఖ్య’ నేత బినామీలు కూడా ఉన్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంటోంది. వందల ఎకరాల భూములను కొనుగోలు చేసిన వారిలో మొదటగా పది మందికి సంబంధించిన లావాదేవీల వివరాలను ఐటీ శాఖ ఇటీవలే రిజిస్ట్రేషన్ శాఖ నుంచి తీసుకున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి.
Oct 1 2016 9:41 AM | Updated on Mar 20 2024 3:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement