అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో అరుదైన మైలు రాయిని అందుకుంది. ఒకే ప్రయోగంలో 8 ఉపగ్రహాలను రెండు కక్ష్యల్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ప్రపంచంలో అమెరికా, రష్యాల తర్వాత ఆ సామర్థ్యం సాధించిన మూడో దేశంగా అవతరించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి సోమవారం చేసిన ప్రయోగంతో ఈ చరిత్ర సృష్టించింది. అంతరిక్ష ప్రయోగాల వినువీధిలో భారత కీర్తి పతాకను సగర్వంగా ఎగిరేలా చేసింది. ఇస్రోకు నమ్మకమైన బ్రహ్మాస్త్రం పీఎస్ఎల్వీ-సీ35 ఉపగ్రహ వాహకనౌకతో సోమవారం ఉదయం 9.12 గంటలకు స్వదేశీ ఉపగ్రహం స్కాట్శాట్-1, ఐదు విదేశీ ఉపగ్రహాలు సహా మొత్తం 8 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించి.. రెండు వేర్వేరు ఎత్తుల్లోని సూర్యానువర్తన ధ్రువకక్ష్యల్లోకి ప్రవేశపెట్టింది. ఇస్రో 55 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఈ తరహా ప్రయోగం చేసి ఘనవిజయం సాధించింది. మొత్తం ప్రయోగం పూర్తవడానికి 2.15 గంటల సమయం పట్టింది. భారత ఉపగ్రహాల ప్రయోగంలో ఇప్పటివరకూ ఇదే సుదీర్ఘ సమయం. ఈ ప్రయోగం ద్వారా సరికొత్త విధానానికి తెరతీశారు. ఇకపై ఒకే రాకెట్ ద్వారా పలు ఉపగ్రహాలను పలు కక్ష్యల్లో ప్రవేశపెట్టటం సులువుకావడంతో వ్యయప్రయాసల భారం గణనీయంగా తగ్గనుంది.
Sep 27 2016 7:59 AM | Updated on Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement