హెచ్సీఏ ఎన్నికలకు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. అయితే ఫలితాలు మాత్రం ఇప్పుడే వెల్లడించొద్దని ఆంక్షలు విధించింది. ఈ నెల 15న ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. హెచ్సీఏ కొత్త కమిటీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా అలా చేయకపోవడంతోపాటు, పదవీకాలం ముగిసినా అధ్యక్షుడిగా ఉన్న అర్షద్ అయూబ్ కొనసాగతుండటంపై హైకోర్టు గతంలో తీవ్రంగా మండిపడింది.