నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కడివేడు సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కోట మండలం చందోడు గ్రామానికి చెందిన ఎనిమిది మంది చేపల కొనుగోలుకు ఆటోలో నెల్లూరుకు వెళుతున్నారు. కడివేడు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.