తెలంగాణలో రైతుల విత్తన దీక్ష | farmers Seed strike | Sakshi
Sakshi News home page

Oct 30 2016 8:24 AM | Updated on Mar 22 2024 11:05 AM

రబీలో శనగ విత్తనాల కోసం రైతాంగం విక్రయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని చాలా మండలాల్లో విత్తనాల కోసం రాత్రి, పగలు అనే తేడా లేకుండా బారులుదీరుతున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో శనగ విత్తనాలకు భారీగా డిమాండ్ ఉంది. శనివారం బిచ్కుంద మండల కేంద్రంలో శనగ విత్తనాల కోసం భారీగా రైతులు తరలిరావడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జుక్కల్, మద్నూర్ మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మద్నూర్ మండల కేంద్రంలో విత్తనకేంద్రం వద్దే శుక్రవారంరాత్రి రైతులు పడిగాపులు కాశారు. కొందరు చలి మంట వేసుకొని నిద్ర కాస్తే.. ఇంకొందరు అక్కడే నిద్రించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement