గ్యాంగ్స్టర్ నయీమ్ టీడీపీ హయాంలోనే తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించినట్టు రూఢీ అయింది. నయీమ్ రాసుకున్న డైరీ, దొరికిన ఫోన్లు, కాల్ డేటాను విశ్లేషించిన ఇంటెలిజెన్స్ వర్గాలు.. టీడీపీ హయాంలో నయీమ్కు ప్రభుత్వ అండదండలు లభించినట్లు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై కొన్ని ఆధారాలు సేకరించాయి. టీడీపీ హయాంలో ఓ మంత్రి నయీమ్కు సహకరించారని.. రాజ కీయ, అజ్ఞాత శత్రువులను అంతం చేసేందుకు నయీమ్ను ఆయుధంగా వాడుకున్నారని విచారణ బృందం గుర్తించింది. టీడీపీకి చెందిన ఆ మాజీ మంత్రితో ఇప్పటికీ నయీమ్కు మంచి సంబంధాలున్నాయని, తరచుగా ఫోన్లలో మాట్లాడినట్లుగా కాల్ డేటాను సేకరించారు.