మార్చి 3 నుంచి ఎంసెట్‌ దరఖాస్తులు | EAMCET applications from March 3 | Sakshi
Sakshi News home page

Feb 21 2017 6:31 AM | Updated on Mar 21 2024 8:11 PM

ఎంసెట్‌–2017 షెడ్యూల్‌ జారీ అయింది. మే 12న నిర్వహించనున్న ఎంసెట్‌కు వచ్చేనెల 3 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. సోమవారమిక్కడ జేఎన్‌టీయూహెచ్‌లో జరిగిన ఎంసెట్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తుల రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.250 చెల్లించాలి. ఇతర విద్యార్థులు రూ.500 రిజిస్ట్రేషన్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎంసెట్‌ నిర్వహణ కోసం 25 ప్రాంతీయ సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేశారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement