జూన్‌లోగా ‘భగీరథ’ పనులు ముగించండి | Complete key Mission Bhagiratha works before onset of monsoon | Sakshi
Sakshi News home page

Jan 25 2017 9:32 AM | Updated on Mar 21 2024 7:53 PM

మిషన్‌ భగీరథ పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారుల ను ఆదేశించారు. 2017 డిసెంబర్‌ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేయాలన్నారు. డిసెంబర్‌ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. జూన్‌లోగానే పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. వర్షాకాలంలో పనులు అనుకున్నంత వేగంగా జరగవని, అందుకే ఇప్పట్నుంచి వర్షాలు పడేలోపు చాలా వేగంగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకు న్న ఈ కార్యక్రమాన్ని అధికారులు రేయింబ వళ్లు కష్టపడి విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని అభినందించారు. ‘‘మంచినీరు గ్రామాలకు చేరడంతోపాటు, గ్రామాలకు చేరిన నీళ్లు ప్రతీ ఇంటికి నల్లా ద్వారా అందించడం చాలా ముఖ్యమైన పని. గ్రామాల్లో అంతర్గత పైపులైన్లు వేయడం కీలకం.

Advertisement
 
Advertisement
Advertisement