కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియం వేదికగా జరిగిన డీజీ ధన్ మేళాలో ప్రొటోకాల్ వివాదం చోటుచేసుకుంది. మేళాలో భాగంగా సభావేదికపై ఉన్న ఫ్లెక్సీ లో ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలు లేకపోగా ప్రొటోకాల్పరంగా ఆహ్వానించ కుండా అవమానపరిచారంటూ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అసహనం వ్యక్తం చేశారు.