పుష్కర స్నానం చేసిన చిరంజీవి | Chiranjeevi holy bath at Rajahmundry VIP pushkar ghat | Sakshi
Sakshi News home page

Jul 22 2015 6:25 PM | Updated on Mar 22 2024 10:56 AM

రాజమండ్రిలోని వీఐపీ పుష్కరఘాట్లో కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి బుధవారం పుణ్యస్నానమాచరించారు. చిరంజీవితోపాటు ఆయన బావమరది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా పుణ్యస్నానం చేశారు. అనంతరం వారిద్దరు తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరువురి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పుష్కర స్నానానికి చిరంజీవి వస్తున్నారని తెలిసి... కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ఆయన అభిమానులు భారీ సంఖ్యలో వీఐపీ పుష్కర ఘాట్ వద్దకు చేరుకున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement