భూమిపూజ చేసిన చంద్రబాబు దంపతులు | Sakshi
Sakshi News home page

భూమిపూజ చేసిన చంద్రబాబు దంపతులు

Published Sat, Jun 6 2015 9:02 AM

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమిపూజ నిర్వహించారు. శనివారం ఉదయం సరిగ్గా 8.49 గంటలకు ఆయన సతీ సమేతంగా భూమిపూజలో పాల్గొన్నారు. తుళ్ళూరు మండలం మందడం-తాళ్ళాయపాలెం గ్రామాల మధ్య బెజవాడ సత్యన్నారాయణకు చెందిన మందడం గ్రామ రెవెన్యూ 136 సర్వేనంబర్‌లోని స్థలంలో శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మల సీతారామన్, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.