బెంగళూరులో బాంబు పేలుళ్లు | bomb-blasts-in-bangalore | Sakshi
Sakshi News home page

Dec 28 2014 10:45 PM | Updated on Mar 21 2024 8:52 PM

బెంగళూరులో ఈరోజు జరిగిన బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. చర్చి స్ట్రీట్లో చర్చి గేట్ సమీపంలో రెండు బాంబులు పేలాయి. ఫుట్పాత్ మీద రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ బాంబుల పేలాయి. అయితే పేలిన బాంబులు తక్కువ తీవ్రత కలిగినవిగా తెలుస్తోంది. ఈ పేలుళ్ల ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు చేస్తోంది. ఉగ్రవాదులు ఇటువంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు ముందే హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. విషయం తెలిసిన వెంటనే కేంద్ర హొం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఫోన్ లో మాట్లాడారు. ఇక్కడ పరస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి కావలసిన సహాయం చేస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement