బస్సు ప్రయాణికుల సంఖ్యపై గందగగోళం | After deadly fire in mahabubnagar confusion over passengers list | Sakshi
Sakshi News home page

Oct 30 2013 1:21 PM | Updated on Mar 20 2024 5:06 PM

మహబూబ్నగర్ జిల్లా బస్సు ప్రమాద ఘటనలో ప్రయాణికుల వివరాలపై ఇంకా గందరగోళం కొనసాగుతోనే ఉంది. జబ్బర్ ట్రావెల్స్ యాజమాన్యం ఇప్పటివరకూ 33మంది ప్రయాణికుల వివరాలు మాత్రమే అందించింది. అయితే ప్రమాదం జరిగిన బస్సు నుంచి 44 మృతదేహాలను వెలికి తీశారు. దాంతో అధికారులు కూడా సమాచారం కోసం ప్రయాణికుల బంధువులపైనే ఆధారపడాల్సి వస్తోంది. కాగా బెంగళూరు నుంచి బస్సు బయల్దేరినప్పుడు ఏడు సీట్లు ఖాళీగా ఉన్నాయని.... మధ్యలో మరికొందరు ఎక్కినట్లు ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ప్రమాదం నుంచి అయిదుగురు ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్, క్లీనర్ పరారైన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement