రూ. 500తో పెళ్లి చేసుకున్న జంట | A couple got married in just Rs 500 in Surat as cash crunch hits their wedding budget | Sakshi
Sakshi News home page

Nov 25 2016 1:19 PM | Updated on Mar 21 2024 6:13 PM

పాత పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. మరికొంత మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర సొంత రాష్ట్రం గుజరాత్‌ లో ఓ జంట మాత్రం అతి తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. సూరత్‌ కు చెందిన భరత్‌ పర్మార్‌, దక్ష కేవలం 500 రూపాయలతో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని పెద్దలు అనుకున్నారు. అయితే పాత పెద్ద నోట్లను మోదీ సర్కారు రద్దు చేయడంతో పరిస్థితులు మారిపోయాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement