పెళ్లికి 2.5 లక్షలు, రైతుకు 50 వేలు | 50 thousand to Farmer and 2.5 lakh to the wedding | Sakshi
Sakshi News home page

Nov 18 2016 7:33 AM | Updated on Mar 22 2024 11:22 AM

పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు నగదు విత్‌డ్రా నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం రోజుకో మార్పు చేస్తోంది. దేశ వ్యాప్తంగా పెళ్లిళ్లు, వ్యవసాయ పనుల సీజన్ కావడంతో బ్యాంకు నుంచి నగదు విత్‌డ్రాలో వారికి సడలింపునిచ్చింది. పెళ్లిళ్ల కోసం రూ.2.5 లక్షల వరకూ, రైతులు రూ. 50 వేల వరకూ నగదును తమ ఖాతాల నుంచి తీసుకోవచ్చని వెల్లడించింది. అదే సమయంలో నగదు మార్పిడి పరిమితిని రూ. 4,500 నుంచి రూ. 2 వేలకు తగ్గించారు. ‘పెళ్లి పనుల కోసం రూ. 2.5 లక్షల వరకూ ఒక కుటుంబం విత్‌డ్రా చేసుకోవచ్చు. పాన్‌కార్డు వివరాలు, వాంగ్మూలం బ్యాంకుకు సమర్పించాలి. ఒక పెళ్లికి ఒక వ్యక్తే విత్ డ్రా చేసుకోవాలి. తండ్రి, తల్లి, వరుడు, వధువుల్లో ఎవరో ఒకరు తమ ఖాతా నుంచి డబ్బు తీసుకోవచ్చు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement