మార్పు కోసమే తాము ఈ ఎన్నికల్లో ముందుకు వచ్చినట్లు ప్రముఖ సినీ నటుడు నాగేంద్రబాబు అన్నారు. గతంలో ఎప్పుడూ చూసినా యూనానిమస్ అంటూ ఒకరికే కట్టబెట్టే ప్రయత్నం చేశారని, ఇప్పుడా పరిస్థితిలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నామని చెప్పారు. ఆదివారం రసవత్తరంగా మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రధానంగా జయసుధ, రాజేంద్ర ప్రసాద్ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ కు మద్దతిస్తున్న నాగేంద్రబాబు మాట్లాడుతూ యూనానిమస్ కారణంగా గతంలో చిన్న చిన్న ఆర్టిస్ట్లు మా అసోసియేషన్ వైపు రాలేకపోయారని, నేడు రాజేంద్రప్రసాద్ ముందుకొచ్చి పోటికి దిగినందున చాలామంది కామన్ ఆర్టిస్ట్లు ముందుకొచ్చి తమ ఓటును వేస్తున్నారని, మంచి వాతావరణం నెలకొందని అన్నారు.
Mar 29 2015 11:41 AM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement