చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ వరుస సినిమాలతో మంచి జోరు మీద ఉన్నారు. ‘దిల్’ రాజు సంస్థలో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా చేస్తున్న సాయిధరమ్తేజ్, అదే సంస్థలో మరో సినిమా కమిట్ అయ్యారు. కల్యాణ్రామ్తో ‘పటాస్’లాంటి పెద్ద హిట్ సినిమా తీసిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్వకుడు. రాశీ ఖన్నా ఇందులో కథానాయిక. సెప్టెంబర్లో చిత్రీకరణ మొదలు కానుంది. ‘పటాస్’ను మించిన వినోదం ఇందులో ఉంటుందని, యువతను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉంటాయని ‘దిల్’రాజు తెలిపారు. సహకారం: ఎస్.కృష్ణ, ఛాయగ్రహణం: సాయిశ్రీరామ్, సంగీతం: సాయికార్తీక్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.
Jul 30 2015 11:02 AM | Updated on Mar 20 2024 1:04 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement