రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'లింగా' చిత్రానికి సివిల్ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. చిత్ర నిర్మాత రవిరత్నం వేసిన పిటిషన్పై న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. శుక్రవారం మధ్యాహ్నంలోగా రూ.10కోట్లు న్యాయస్థానానికి కట్టాలని ఆదేశించింది. కాగా రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 'లింగా' విడుదల కానుంది. అయితే.. కోర్టు ఆదేశాన్ని తాము గౌరవిస్తామని లింగా చిత్ర నిర్మాత రాక్లైన్ వెంకటేష్ తెలిపారు. సినిమా మాత్రం అనుకున్నట్లుగానే విడుదల అవుతుందని ఆయన చెప్పారు. రజనీకాంత్ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కెఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. సెన్సార్ బోర్డ్ 'యు' సర్టిఫికేట్ ఇచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,300 థియేటర్లలో విడుదల కానుంది. రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్రంలో రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు.
Dec 11 2014 3:42 PM | Updated on Mar 21 2024 6:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement