దేశీయ బొగ్గురంగంలో నెలకొన్నగుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇంధన భద్రత సమీక్షించి కోల్ ఇండియా మోనో పలికి చెక్ పెట్టే బాధ్యతను సీనియర్ భారత ప్రభుత్వ అధికారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పగించినట్టు తెలుస్తోంది. దీనిపై ఒక సంవత్సరంలోగా ఈ సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద కోల్ మైనర్ కోల్ఇండియా లిమిటెడ్ను విభజించేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్టు సమాచారం. ఈ రంగంలో మోనోపలీ పెరిగిపోయిందని.. దీన్ని తగ్గించేందుకే ఈ చర్య తీసుకోనున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు చెప్పినట్టు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.
Dec 3 2016 7:48 AM | Updated on Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
Advertisement
